BREAKING: కవిత రిమాండ్ పై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు !

-

BREAKING: కవిత రిమాండ్ పై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కవిత జ్యుడీషియల్ రిమాండ్ పై తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టు ముందు కవితను హాజరుపరిచారు జైలు అధికారులు. అయితే.. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని కోరింది ఈడీ.

Image

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా తెలిపారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుంది కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని అంటున్నారు.. అలా ఏమి లేదని కోర్టుకు రానా తెలిపారు.

కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. అయితే.. కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని తెలిపారు కవిత తరపు న్యాయవాది. దీంఓ అప్లికేషన్ వేసుకోవాలని సూచించారు జడ్జి కావేరి బవేజా. ఈ తరుణలోనే కవిత జ్యుడీషియల్ రిమాండ్ పై తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news