IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం : సీఎం రేవంత్ రెడ్డి

-

IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందజేయనున్నట్టు  సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT) ప్రారంభోత్సవం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చేనేత అభయమస్తం లోగోను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నేతన్న కు చేయూత పథకం కింద రూ.290 కోట్లు నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చేనేత కార్మికుల జీవన విధానంలో మార్పు రాలేదు. ఆత్మగౌరవంతోని బ్రతికే పరిస్థితి కనిపించలేదు. బతుకమ్మ చీరలు నేతన్నలకు నేయాలని చీరలు ఇచ్చారు.. కానీ నేతన్నలకు నిధులను విడుదల చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్లతో సహా అందరికీ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మందికి ప్రతీ ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news