పచ్చని తెలంగాణను మళ్లీ పంజాబ్ లాగా మారుస్తావా ? – RS ప్రవీణ్‌ ఫైర్‌

-

RS Praveen Kumar fire on CM Revanth Reddy: పచ్చని తెలంగాణను మళ్లీ పంజాబ్ లాగా మారుస్తావా ? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై RS ప్రవీణ్‌ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. జగిత్యాల డ్రగ్స్ వ్యవహారం నాలుగు నెలల కాంగ్రెసు పాలనపై మాయని మచ్చ అంటూ మండిపడ్డారు.

RS Praveen Kumar fire on CM Revanth Reddy

చక్కగా చదువుకోవాల్సిన స్కూలు పిల్లలను మత్తులో దించి మహా నగరంలో రేవ్ పార్టీలకు యధేచ్చగా తరలించడం అంటే సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన Drug Free Telangana హామీ వట్టి భూటకం అని తేలిపోయిందని విమర్శలు చేశారు RS ప్రవీణ్‌ కుమార్‌. పచ్చని తెలంగాణను మళ్లీ పంజాబ్ లాగా మారుద్దమనుకున్నరా?? మీ గ్యారంటీల గారడీలను ఆపి మా పిల్లల భద్రతకు భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండని డిమాండ్‌ చేశారు RS ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news