నేటితో ముగియనున్న కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ

-

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీ ఇవాళ ముగియనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది ఈడి. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాం లో కవిత పై ఇంటరాగేషన్ చేసిన ఈడి…ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది.


కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు చేసింది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు పంపింది సుప్రీం కోర్టు. ఇక అటు సుప్రీంకోర్టులో కూడా కల్వకుంట్ల కవితకు ఊరటదక్కలేదని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news