క్రిషాంక్ పై కేసు.. సీఎం రేవంత్ రెడ్డి పై ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్..!

-

మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పై కేసు, ఫోన్ సీజ్ అంశంపై ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేంది రేవంత్ గారు?? అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట.

దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే మా యువ నేత, తెలంగాణ పోరాట యోధుడు క్రిషాంక్ ఫోను సీజ్ చేశారు. దీన్నే పోలీసు భాషలో అటెన్షన్ డైవర్షన్ MO అంటరు. ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలనెత్తుకొని పారిపోతారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవి.’ అంటూ ఘాటు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version