ప్రీతి ఆత్మహత్య కేసులో సైఫ్‌పై ఆరోపణలు వాస్తవమే :కేఎంసీ ర్యాగింగ్‌ నిరోధక కమిటీ

-

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని ధారావత్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్న ప్రీతి సీనియర్ సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని కేఎంసీ ర్యాగింగ్‌ నిరోధక కమిటీ తేల్చింది. సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్‌ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తుండగా మరో 97 రోజుల పాటు పొడిగించినట్లు తెలిపింది.

గత సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులతో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ప్రాణాలతో పోరాడుతూ అదే నెల 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు, ఆమె ఫోన్ లో ఉన్న డేటా ప్రకారం సైఫ్ నిందితుడిగా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

ఈ క్రమంలోనే పోలీసులు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఏడాదిపాటు అతడు తరగతులకు రాకుండా వేటు వేస్తూ కేఎంసీ ర్యాగింగ్‌ నిరోధక కమిటీ నిర్ణయించింది. సైఫ్‌ హైకోర్టును ఆశ్రయించగా  తాత్కాలికంగా సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత నవంబరు 9వ తేదీన హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్‌ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించగా.. సైఫ్‌ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు సైఫ్‌పై ఆరోపణలు వాస్తమేనని న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version