ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్లు – భట్టి

-

సీట్ల కేటాయింపు పై కాంగ్రెస్ పార్టీలో అలజడి నెలకొన్న తరుణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కి 74 నుండి 78 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు.

ఆచరణ సాధ్యం కానీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు భట్టి. మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పక నిలబెట్టుకుంటుంది అన్నారు. అధికారంలోకి వచ్చాక తాము ప్రకటించిన అన్ని డిక్లరేషన్ లను అమలు చేస్తామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కెసిఆర్ ని గద్దె దించుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news