సికింద్రాబాద్ బంద్..వేలాది మందితో హిందువుల భారీ ర్యాలీ

-

సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వర్గానికి చెందిన దుండగుడు సలీం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ శనివారం సికంద్రాబాద్ బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే భారీ ర్యాలీ నిర్వహించాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి వేలాదిగా హిందువులు కాషాయ జెండాలు పట్టుకుని ర్యాలీ తీశారు.

మహంకాళి టెంపుల్ నుంచి జనరల్ బజార్, బాటా, మోండా మార్కెట్ మీదుగా ముత్యాలమ్మ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగింది. చిన్న పిల్లల నుంచి మహిళలు, పెద్దవాళ్లు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో నగరంలోని హిందూ ఆలయాలపై ఓ వర్గం వారి నుంచి దాడులు పెరుగుతున్న క్రమంలో వాటిని ఖండిస్తూ అందుకు నిరసనగా ఈ ర్యాలీ తీసినట్లు హిందూ సంఘాలు తెలిపాయి. ఇక మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news