బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్

-

అరిజిన్ డైరీ సీఈవో శేజల్ గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై లైంగిక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. బిజినెస్ మీటింగ్ పేరుతో పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఏర్పాటు చేశారని శేజల్ ఆరోపించింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ రూమ్ నెంబర్ 404లో మందు సిట్టింగ్ ఏర్పాటు చేశారని.. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని వారి పైన కూడా సంచలన ఆరోపణలు చేసింది.

ఇంకా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, పనులు చేయించుకోవాలంటే తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే అన్నారని ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాదు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇటీవల ఆమె న్యాయం కోసం జాతీయ మహిళా కమిషన్ నీ సైతం ఆశ్రయించింది. అయితే తాజాగా ఆమె దుర్గం చిన్నయ్య పై సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని సిబిఐ ని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news