సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన జబర్దస్త్ నటుడు

-

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి రోజా చొరవ తీసుకొని పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లింది.

వెంటనే స్పందించిన సీఎం జగన్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు పంచ్ ప్రసాద్. “మీ సాయం ఎప్పటికీ మరిచిపోలేను. నా ఆరోగ్య సమస్యను మంత్రి రోజా గారు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి.. చికిత్స కు కావలసిన డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రి రోజా గారికి ధన్యవాదాలు” అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు పంచ్ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news