కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం : షబ్బీర్ అలీ

-

కామారెడ్డిలో నియోజకవర్గ కాంగ్రెస్ అనుబంధ సంస్థల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి భూములను అమ్ముకోవడానికి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని ఆ పార్టీని భూస్థాపితం చేద్దామన్నారు. హైదరాబాద్, గజ్వేల్ లో రింగ్ రోడ్డు పేరుతో భూములను అమ్ముకొని కామారెడ్డి చుట్టు పక్కల విలువైన భూములను అమ్మేందుకు కేసీఆర్ వస్తున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకమే కేసీఆర్ చేసిన అభివృద్ధి అని విమర్శించారు. అదేవిధంగా కమీషన్లు దండుకొని నాణ్యత లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని.. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ ఒక్కనితోనే తెలంగాణ రాలేదని.. సోనియాగాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ కళ సాకారమైందని తెలిపారు షబ్బీర్ అలీ. కామారెడ్డిలో కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ సైనికులకు మధ్య యుద్ధం జరుగుతుందని.. కామరెడ్డిలో కౌరవ-పాండవుల యుద్ధం జరుగబోతుందని.. కౌరవులను ఓడించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news