పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాం..పువ్వాడకు షర్మిల వార్నింగ్ !

-

పిచ్చి..పిచ్చిగా మాట్లాడితే.. పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని..పువ్వాడకు షర్మిల వార్నింగ్ ఇచ్చారు. పువ్వాడ ఒక కంత్రి మంత్రి అని.. మనలను భయపెట్టే పనులు చేస్తాడని నిప్పులు చెరిగారు. మనం వైఎస్సార్ వారసులం.. మనం బయపడతమా..అని పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహాలను కూలుస్తున్నారని.. బహిరంగ సభలో మాట్లాడితే సమాధానం చెప్పే దమ్ము లేదని నిప్పులు చెరిగారు.

నువు మంత్రివి కదా…ఎందుకు కంత్రి అయ్యావు అడిగితే సమాధానం చెప్పే దమ్ము లేదు.. కబ్జాలకు సమాధానం చెప్పే సత్తా లేదని నిప్పులు చెరిగారు. ఆయన మెడికల్ కాలేజీ కి దెబ్బ తగులుతుందని…. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ను రానివ్వడం లేదు..సీట్లు 3 కోట్ల కు అమ్ముకుంటున్నారన్నారు.

ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ఉచిత సీట్లు ఇస్తామని ఇచ్చావా ? అని నిలదీశారు. బస్టాండ్ ను చూస్తే నీ పరిపాలన అర్థం అవుతుందని.. సమాధానం చెప్పలేక…మా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఆర్టీసీ మంత్రి అయ్యాక…ఖమ్మం కి వచ్చే బస్సులు తగ్గిపోయాయట.. ఆర్టీసీ చార్జీలు మాత్రం భారీగా పెరిగి పోయాయి.. నీ మొహం లానే ఆర్టీసీ ఏడ్చిందని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news