రేవంత్ కు షాక్.. కేసీఆర్ టచ్ లోకి తీన్మార్‌ మల్లన్న ?

-

Shock to Revanth Reddy Teenmar Mallanna in touch with KCR: కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. రిజర్వేషన్‌ను అమలుచేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని పేర్కొన్నారు.

Shock to Revanth Reddy Teenmar Mallanna in touch with KCR

 

తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్కారు రాబోతుందని, బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు.

నా ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగాడంటూ ఫైర్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి వీళ్లకు మిత్తి, అసలు, చక్రవడ్డీతో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెల్వనియ్యనని కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news