సీఐ జితేందర్ రెడ్డి నా భర్తను వేదించాడు – ఎస్ఐ శ్రీరాములు భార్య

-

SI Sriramulu’s wife Krishnaveni : మీ ఎస్సీలు మారరా అంటూ కులం పేరుతో సీఐ జితేందర్ రెడ్డి నా భర్తను వేదించాడు అంటూ ఎస్ఐ శ్రీరాములు భార్య కృష్ణవేణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కులం పేరుతో సీఐ హింస పెట్టినందుకు అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు శ్రీరాములు భార్య, అక్క.

SI Sriramulu’s wife Krishnaveni about her husband case

ఇక అటు చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇచ్చారు. ఆంధ్రకు చెందిన నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు శ్రీరాముల శ్రీనివాస్. సీఐ వేధింపులతో అశ్వరావుపేటలో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఈరోజు ఉదయం 12:20 గంటలకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మృతి చెందారు. ఇక ఈ కేసుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version