బాచుపల్లి గోడ కూలిన ఘటనలో ఆరుగురు అరెస్టు

-

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్షానికి గోడ కూలి  నివాసంపై పడగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు కారణమైన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌ రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌ సహా.. ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేష్‌, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న రైజ్ డెవలపర్స్ కన్‌స్ట్రక్షన్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికుల షెడ్‌పై ప్రహారీ గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఓ మహిళ, నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఆరుగురిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news