Telangana : అమ్మకానికి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు..రూ.3 లక్షలకు ఒక పోస్ట్ !

-

Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాలంలో మరో సంఘటన తెరపైకి వచ్చింది. అమ్మకానికి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పెట్టారు. రూ.3 లక్షలకు ఒక పోస్ట్ చొప్పున స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అమ్మేస్తున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాలు చేపట్టగా వరంగల్ జిల్లా నుంచి 706 మంది ఉద్యోగాలు పొందారు.

Staff nurse jobs for sale..one post for Rs.3 lakh

అందులో కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలోని పీఎంఎస్ఎస్‌వై సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్న వారిలో 18 మంది ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో ఉన్నారు. ఆ 18 మంది నర్సుల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news