లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి..!

-

హబ్సి గూడ స్కూల్ ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పాప మృతి చెందిది. ప్రమాదం అనంతరం నాగోల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి పోలీసులు తరలించగా. చికిత్స పొందుతూ. విద్యార్థిని మృతి చెందిది. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం విద్యార్థిని సాత్విక ను ఆటోలో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ ఎల్లయ్య.. హబ్సిగూడ వద్ద సిగ్నల్ పడటంతో ఆటోను ఆపాడు. కానీ ఆ సిగ్నల్ పడిన విషయం కూడా చూసుకోకుండా.. వెనక నుంచి వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది లారీ.

దాంతో ముందున్న బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో ఆటోలో ఉన్న సాత్వికకు, డ్రైవర్ ఎల్లయ్య కు తీవ్ర గాయాలు కాగా.. క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీసి.. సాత్విక, ఎల్లయ్యని హాస్పిటల్ కు తరలించగా.. సాత్విక మృతి చెందింది. ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. తార్నాక లోని కిమితి కాలనీలో సాత్విక ను పిక్ చేసుకున్నాడు ఆటో డ్రైవర్. అయితే మరో 10 నిమిషాల్లో స్కూల్ కు చేరుకోవాల్సిన సాత్విక.. అంతలోనే కానరాని లోకాలకు చేరుకోవడంతో ఆస్పత్రిలో రోధనలు మిన్నంటాయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version