నేడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభం

-

తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు ఇవాళ శ్రీకారం చుట్టబోతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరగబోయే సభలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాలను కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వర్చువల్ గా ప్రారంభించనుండగా, ఇప్పటికే హస్తం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌  తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news