సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఆయనకు శుక్రవారం నోటీసులను జారీ చేసింది. కేసు విచారణను మధ్య ప్రదేశ్ కి మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది.

గతంలో ఈ కేసులో రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్ సన్ ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్లు పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. ఆ తరువాత బెయిల్ మీద బయటకు రాగా.. తరువాత పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news