హన్మకొండలో చెట్టును ఢీకొన్న టాటా ఏసీ.. ఏకంగా 5 గురు యువకులు !

-

 

హన్మకొండలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి టాటా ఏసీ.. చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన ఆదివారం వేకువ జామున చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో హసన్ పర్తి మండలం పెంబర్తి కి చెందిన ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

accident
accident

డ్రైవర్ కొయ్యడ రాకేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఇక గాయాల భారిన పడ్డ వారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు స్థానికులు. ఈ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు… గాయపడ్డ వారు కోయ్యాడ రాకేష్, జోరిక సందీప్, మేకల జిధ్యన్, కక్కర్ల పృధ్వీ, పున్నం చందర్ గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news