Telangana : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

-

రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్​లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. రెండు గదుల్లో ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

 

ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలు.. రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికిపైగా రాకపోతే సెకండ్‌ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ నెల 13న పోలింగ్‌ జరిగింది. నియోజకవర్గంలోని 9 జిల్లాల్లో సుమారు 29,720 మంది ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. 90.40 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చెన్నకేశవ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌ రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, మాణిక్‌ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news