తెలంగాణలో గత 24 గంటల్లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

-

తెలంగాణలో గత 24 గంటల్లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ హెల్త్‌ బృందం అధికారిక ప్రకటన చేసింది. నిన్న ఒక్క రోజే 538 మందికి కరోనా పరీక్షలు చేయగా 6 గురికి కరోనా పాజిటివ్‌ గా నమోదు అయింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది ఆరోగ్య శాఖ.

కాగా, కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితిలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా కేసులపై సర్వెలెన్స్ పెంచాలని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని వివరించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news