నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

-

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటోంది.

ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. తొమ్మిదో తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. అదే రోజు శాసనసభ కార్యకలాపాల సలహాకమిటీ (బీఏసీ) సమావేశాన్ని నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. 10వ తేదీన మల్లు భట్టి విక్రమార్క ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాలు సుమారు 7-10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంపై ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వాటిని తిప్పికొట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news