ప్రచార వ్యూహంపై ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణ ఖరారు

-

తెలంగాణలో ఈసారి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఫలితాలు ఇక్కడ కూడా తీసుకురావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ.. ప్రచార వ్యూహంపై రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణ ఖరారు చేయనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనున్న ప్రచార కమిటీ సమావేశంలో ప్రచార వ్యహంపై చర్చించనున్నారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ కమిటీ కార్య వర్గం సహా సహా ఇతర నేతలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాల వివరాలను ప్రకటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కోరారు.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేసి, జనంలో వెళ్లాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news