BREAKING : CS సోమేష్ కుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ

-

ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. తెలంగాణ లో భూ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ పలువురు నేతలు మెమోరండం అందజేసారు.

ధరణి ని రద్దు చేసి పాత పద్దతి ని తీసుకురావాలి. .. నిషేదిత జాబితాలో పొరపాటు గా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి..పోడు భూముల కు పట్టాలు ఇవ్వాలి… అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి… కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి.. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news