షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్షలు

-

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30వ తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్ష జరగనుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతో పాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే కొందరు అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. పోటీ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమయ్యేవారు మాత్రం పరీక్షలను వాయిదా వేయొద్దని కోరుతున్నారు.

అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్-2  పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ ఏకాభిప్రాయానికి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news