ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. దశాబ్ది అవతరణ ఉత్సవాలను ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథణ, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధాజగన్నాథం మాట్లాడుతూ… తెలంగాణ అవతరణ మామూలుగా సాధించిన విజయం కాదు.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు.
తెలంగాణ ఆచరిస్తూంది , దేశం అనుసరిస్తుంది అన్న విధంగా దేశంలో పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని వెల్లడించారు. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.. కేంద్రం సవతితల్లి ప్రేమతో తెలంగాణ అభివృద్ధి కి అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ కేసీఆర్ అకుంఠిత దీక్షతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచిందని.. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో శరవేగంగా దూసుకు పోతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలో కల్లా ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ లో కేసీఆర్ ఏర్పాటు చేసారన్నారు మంధాజగన్నాథం.