KRMB మీటింగ్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దూరం

-

KRMB మీటింగ్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దూరం అయ్యారు. శ్వేత పత్రం పేరు చెప్పి KRMB మీటింగ్ డుమ్మా కొట్టారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు KRMB మీటింగ్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దూరం అయ్యారు.

అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెడుతునందున్న సాగర్, శ్రీశైలం అప్పగింత అంశంపై పై ఈరోజు ఢిల్లీలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

కాగా, కేసీఆర్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేఆర్ఎంబీకీ ప్రాజెక్టులను అప్పగించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదు. రాజకీయాలు కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు హరీశ్ రావు.

నెలరోజుల లోపు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తారని సమావేశంలో స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 01న కేఆర్ఎంబీ మీటింగ్ జరిగిందని హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించిన తరువాత.. అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రంకెలేస్తుందన్నారు హరీశ్ రావు. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు మీటింగ్ మినిట్స్ ఉన్నదని హరీశ్ రావు స్పష్టం చేశారు.బట్ట కాల్చి మా మీద వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news