KCR CM ఛాంబర్‌లో అడుగుపెట్టే ముహూర్తం ఖరారు

-

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రారంభోత్సవం రోజు నుంచే సెక్రటేరియట్​లో కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, కొత్త సచివాలయం ప్రారంభ వేడుకలు ఈనెల 30న నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం, మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 గంటల మధ్య యాగం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం సచివాలయానికి రిబ్బన్ కటింగ్ చేసి ఆ వెంటనే 6వ అంతస్తులోని తన చాంబర్ లో సీఎం కేసీఆర్ కొలువుదీరనున్నారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య ఛాంబర్లలో మంత్రులు ప్రవేశించనున్నారు. 2:15 నిమిషాలకు గ్యాదరింగ్ కార్యక్రమంలో కేసిఆర్ ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news