తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత

-

తెలంగాణ సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46 తో కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు నాన్ లోకల్ గా మారే అవకాశం ఉందని వారు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో వారంతా ఒక్కసారిగా సచివాలయం వైపు దూసుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం హోంగార్డుల డిమాండ్ పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news