BREAKING: టెట్ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక రేపటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆన్లైన్ లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తుండగా… 27వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా,ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్ణయించిందని వెల్లడించారు. ఈనెల నుంచి వారి సెల్ఫోన్ బిల్లులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. కొన్ని రాష్ట్రాలలో స్కాములు ఉంటే… తెలంగాణ రాష్ట్రంలో స్కీములు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచుతామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఎన్నికలలో… కెసిఆర్ ప్రభుత్వం మరోసారి రాబోతుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news