BREAKING : BRS బీసీ నేతలతో తలసాని ఆకస్మిక సమావేశం

-

బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ బీసీ నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకస్మికంగా సమావేశమయ్యారు. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బేటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీసీ నినాదాన్ని ఎదుర్కొనేందుకుగాను వ్యూహరచనలో భాగంగా ఈ భేటీ జరుగుతుందని తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి బీసీలపై చేసిన వాక్యాలను ఖండిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసేందుకు కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కాగా, మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావులో తుకారం బావురావ్ సాటే జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జిల్లాలోని పార్టీ ప్రముఖులతో సమావేశం అవుతారు. కోల్హాపూర్ లోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర యుగ కవిగా, దళిత సాహిత్య చరిత్రలో అధ్యుడిగా బావురావ్ కు పేరు ఉంది. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news