కాంగ్రెస్ పార్టీతో సిపిఎం పార్టీకి కుదరని పొత్తు.. ఒంటరిగా పోటీ చేయనున్న కామ్రేడ్లు ?

-

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. సిపిఐ కి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇస్తామని ఆ పార్టీ నేత డి. రాజాకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.

The alliance of the CPM party with the Congress party is impossible
The alliance of the CPM party with the Congress party is impossible

ఇక సిపిఎంకు ఇచ్చే సీట్లపైనే ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం సీట్లు ఇవ్వాలని సిపిఎం పట్టు పడుతుండగా…. కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ రాలేదు. దింతో కాంగ్రెస్ పార్టీతో సిపిఎం పార్టీకి పొత్తు కుదర లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో సిపిఎం పార్టీకి పొత్తు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు కామ్రేడ్లు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీ తన మొదటి అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఏకంగా 51 మంది పేర్లు వెల్లడించింది కాంగ్రెస్ అధిష్టానం.

Read more RELATED
Recommended to you

Latest news