Telangana: పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..!

-

పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు. రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది.

రవళి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ జంటను పట్టుకొచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. మూడు రోజుల క్రితం రవీందర్ ఇంటికి రవళి రావడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.. దీంతో రవళి భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అది చూసిన రవీందర్ కత్తితో గొంతు కోసు కున్నాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news