ప్రముఖ ఆస్పత్రికే రోగం వచ్చింది… మరీ ఇంత దారుణమా…!

-

వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ని సమీక్షలు చేసినా, ఎన్ని నిధులు ఇచ్చినా, ఎన్ని విధాలుగా అండగా నిలిచినా సరే రోజు రోజుకి తెలంగాణాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్  ఎంజిఎం ఆసుపత్రి ఏఎంసి వార్డులో వర్షానికి నీరు నిలిచిపోయింది. దీనితో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వందలాది మంది రోగులు కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది.

రోగులను చూడటానికి వచ్చిన బంధువులు కూడా నరకం చూస్తున్నారు. నీరు మురుగు వాసన రావడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గత వారం రోజుల నుంచి నీరు భారీగా నిలిచిపోయింది. అయినా సరే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి అసలు కనపడటం లేదు. మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష అనంతరం ఎంజీఎం లో అద్వాన పరిస్థితులు నెలకొన్నాయి అని అక్కడ ఉన్న కొందరు అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news