కరీంనగర్ జిల్లాలో భయపెడుతున్న సెల్యూలైటిస్ వ్యాధి..!

-

కరీంనగర్ జిల్లాలో మరో వ్యాధి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. ప్రధానంగా ఈ వ్యాధి బారిన పడ్డవారు దురదతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి పేరు సెల్యూలైటిస్. ఇది తొలుత  దురదతో మొదలై గాయంగా మారుతుంది వ్యాధి. ఇక  నెల రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఇక  సెల్యూలైటిస్ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే.  కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతుంది.

ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది.  నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది.  ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు.. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలంటున్నరు వైద్య నిపుణులు. ఈ వ్యాధి లైట్ లే నిర్లక్ష్యం వహిస్తే.. మీకు ఇబ్బందులు మాత్రం తప్పవు. ఇంకెందుకు ఆలస్యం.. సెల్యూలైటిస్ వ్యాధి సోకిన వారందరూ వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news