ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. సొంత నిధులతో భూమి పూజ

-

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. ఈ మేరకు తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఈ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు ఆమె తెలిపారు.

 

ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యేగా గెలిస్తే యువత కోసం స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నాను. చెప్పినట్లుగానే సొంత నిధులతో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు భూమిపూజ చేశాను. ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం పెరుగుతుంది అని ఆమె అన్నారు.  స్కిల్‌ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పొగిడేస్తున్నారు. అలాగే ఈ భూమిపూజ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన స్థానిక యువత తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news