వేములవాడ ఆలయ విస్తరణకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ విస్తరణకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే…. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆశీర్వచనం అందించారు వేములవాడ ఆలయ అర్చకులు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసారు ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.

The priests of Vemulawada temple who gave blessings together with Chief Minister Revanth Reddy at the secretariat

వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు ఆలయ అర్చకులు. దీంతో వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news