విద్యార్థిని భవిష్యత్‌ కోసం.. తల్లి మృతి విషయాన్ని దాచిన టీచర్స్‌ !

-

 

విద్యార్థిని భవిష్యత్‌ అంధ కారం కావొద్దని.. తల్లి మృతి విషయాన్ని దాచారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన ములుగులో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు కాటారం మండలం దామెరకుంట సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో బైపీసీ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని సౌమ్య తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించగా, తన తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు.. ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news