హరితహరం పేరును మార్చిన రేవంత్.. కొత్త పేరు ఇదే !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి.. ముందుకు వెళ్తున్నారు. రైతు భరోసా నుంచి హరితహారం వరకు అన్నిటి పేర్లు మార్చుతున్నారు. అయితే తాజాగా… మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి.

The Telangana government has changed the name of Haritaharam to Vanamahotsava for Telangana

తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… హరితహారం కార్యక్రమాన్ని ఎంతో వినూత్నంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం పేరు మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

 

తెలంగాణకు హరితహారం గా ఉన్న పేరును వన మహోత్సవంగా సిఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. పాలనపై దృష్టి పెట్టకుండా… జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే పేర్లు మార్చాలని… ఆయనకు ఏపీ ప్రజలు బుద్ధి చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా బుద్ధి చెబుతారని కొంతమంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news