అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేసిన దుండగులు..!

-

అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్లితే.. పెద్దపల్లి జిల్లా  మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఈనెల 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఇంటి సమీపంలో ఉండే లావణ్య కొంతకాలం కిందట ఆమె వద్ద విడతల వారీగా రూ.1.50 లక్షల అప్పు తీసుకొంది. కొంతకాలంగా తిరిగివ్వాలని రాజేశ్వరి ఒత్తిడి చేసింది. దీంతో ఈ నెల 8న డబ్బులు ఇస్తామని ఆమెను లావణ్య ఇంటికి పిలిచింది. అనంతరం భర్త రవి మరో వ్యక్తి కలిసి రాజేశ్వరి గొంతు నులిమి హత్య చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version