యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు

-

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ఆలయ ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపద్యంలో ఈనెల 21వ తేదీ నుండి మూడవ తేదీ వరకు ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దారు. స్వామి వారి తిరుకల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version