తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పిన టైమ్స్ నౌ సర్వే

-

తెలంగాణ ప్రజలు మరోసారి సిఎం కేసీఆర్ వైపే ఉన్నారని టైమ్స్ నౌ సర్వే చెప్పింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, బీజేపీలు దరిదాపుల్లో సైతం లేవని తేల్చి చెప్పింది ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ. తెలంగాణలో కేసీఆర్ హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే మరో రెండు స్థానాలు ఎక్కువ సాధించే అవకాశం ఉందని చెప్పింది టైమ్స్ నౌ సర్వే.

cm kcr is said that hyderabad is mini india
cm kcr is said that hyderabad is mini india

అంటే లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి 9 నుంచి 11 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఈనెల 5తో ముగియనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2018లో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా… డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించి, 11న ఫలితాలు ప్రకటించారు. దీంతో 2023 ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య ఏ రోజైనా ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news