యాక్టింగ్‌లో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరొకరు ఉండరు : బండి సంజయ్

-

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమ వస్తాయన్నారు. అన్నీ సర్వేలు కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందనే చెబుతున్నాయన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చి మరీ బరిలోకి దించుతున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కవితకు కేసీఆర్ టికెట్ ఇస్తే.. 33 శాతం మహిళలకు టికెట్ ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్యీ కవితకు చిత్తశుద్ధ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో సగ మందికీ బీ ఫామ్ ఇవ్వరు అని..కేసీఆర్ ప్రకటించారు.  కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తవేనని.. ఒకరికి టికెట్ ఇచ్చి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్‌లో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరోకరు లేరు అంటూ విమర్శించార బండి సంజయ్. . క్యాడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ జిమ్ముక్కులు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రుడిపై కూడా భూములు ఇస్తామంటారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news