నేడు ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే

-

 

నేడు నిజామాబాద్​లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్‌కు వస్తారు. 3 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోదీ సభా స్థలికి చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. ఇక సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో బీదర్‌కు తిరుగు ప్రయాణమవుతారు. బీదర్‌ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ దిల్లీకి వెళ్లనున్నారు.

These are the projects that Prime Minister Modi will start today

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఇవాళ రూ. 8వేల కోట్ల విలువైన పనులకు పీఎం మోడీ శ్రీకారం చుట్టనున్నారు. * NTPC పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం * మనోహరాబాద్-సిద్దిపేట కొత్త రైలు మార్గం, సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు, మన్మాడ్, ముద్కేడ్-MBNR-డోన్ మధ్య రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టు ప్రారంభం * 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆయుష్మాన్ భారత్ కింద పలు జిల్లా కేంద్రాల్లో క్రిటికల్ కేర్ విభాగాల పనుల ప్రారంభం.

Read more RELATED
Recommended to you

Exit mobile version