ధోనితో ఇదే చివ‌రి మ్యాచ్ కావచ్చు.. కోహ్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా ఇవాళ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ప్లేఆఫ్స్‌లో అడుగే ల‌క్ష్యంగా రెండు జ‌ట్లు బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై విజ‌యం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది. ఒక‌వేళ‌ భారీ తేడాతో ఆర్‌సీబీ గెలిస్తే నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌కు చేర‌నుంది. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బ‌హుషా.. ధోనితో తాను మైదానంలో త‌ల‌పడ‌డం ఇదే ఆఖ‌రి సారి కావొచ్చని పేర్కొన్నాడు.

జియో సినిమా ఇన్‌సైడ్ అవుట్ షోలో కోహ్లీ మాట్లాడుతూ.. దిగ్గ‌జ ఆట‌గాడు ధోనితో క‌లిసి తాను మ‌ళ్లీ ఆడే అవ‌కాశం ఉండొచ్చు.. లేదా ఇదే చివ‌రిది కావొచ్చు.. ఈ విష‌యం ఎవ‌రికి తెలుసున‌ని అన్నాడు. అభిమానులు ఎంతో అంద‌మైన ఈ క్ష‌ణాలు అస్వాదించాలని సూచించాడు. టీమ్ఇండియా త‌రుపున ధోనితో క‌లిసి ఎన్నో సంవ‌త్స‌రాలు ఆడాన‌ని, కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాన‌ని చెప్పుకొచ్చాడు. ధోని ఫినిష‌ర్‌గా ఎన్నో మ్యాచుల‌ను గెలిపించాడో మ‌నంద‌రం చూశామ‌ని కోహ్లి అన్నాడు. గాయంతోనే ధోని ఈ సీజ‌న్‌లో ఆడుతున్నాడు. అందుక‌నే ఆఖ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ బౌండ‌రీలు కొడుతూ అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news