ఇళ్లు కూల్చిన దుండగులు టెర్రరిస్టులతో సమానం – ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్

-

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు నేడు కరీంనగర్ లో పర్యటించారు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. ఇటీవలే పేద ముస్లింల ఇండ్లను కూల్చిన సంఘటన లో రేకుర్తి జరీనా నగర్, మొహసీన్ నగర్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి కూల్చిన ఇండ్లను పరిశీలించారు. ఆ తరువాత పేద ముస్లింలతో మాట్లాడి పూర్తిస్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ముస్లింల ఇండ్లు కూల్చిన దుండగులు టెర్రరిస్టులతో సమానం అన్నారు.

ఇండ్లు కూల్చిన దుండగులపై టెర్రరిస్ట్ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలన్నారు. కూల్చిన ఇండ్ల స్థలంలోనే ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. పేద ముస్లింలకు న్యాయం జరిగేంత వరకు ఎంఐఎం అండగా ఉంటుందన్నారు జాఫర్ హుస్సేన్. 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ రౌడీలకు, భూకబ్జా కోరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news