నేనే టీఆర్ఎస్‌ పార్టీ “రెబల్‌”ను కాదు : తుమ్మల సంచలనం

-

ఖమ్మం : మధిర లో మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి ” రెబల్ “ని కాదని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం చేసే ప్రసక్తే లేదు నాకు పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వరరావు.

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని.. తన రాజకీయాలు ప్రజల కోసమేనని తేల్చి చెప్పారు. తన పై చాలా దుష్ప ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన పై దురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని.. హెచ్చరించారు తుమ్మల నాగేశ్వరరావు. టీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేస్తుందని.. దీనిపై ఎలాంటి డౌట్‌ లేదన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కాగా.. గత కొన్ని రోజుల నుంచి తుమ్మల నాగేశ్వరరావు… టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే పార్టీ అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news