17న కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల..?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో తుమ్మల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తుమ్మలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వీరు కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా తుమ్మలను ఆహ్వానించారు. 17వ తేదీన జరిగే సభలో కాంగ్రెస్‌లో చేరాలని థాక్రే కోరగా.. దీనికి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరావు, భట్టి విక్రమార్క వంటి కీలక నేతలు పలు దఫాలుగా తుమ్మలను కలిశారు. అయితే కాంగ్రెస్‌లో చేరే విషయంపై తుమ్మల నాగేశ్వరావు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. తాజ్ కృష్ణ హోటల్ లో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. దీని తరువాత 17న తుక్కుగూడలో విజయభేరీ సభ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news