ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుంది. బంజారాహిల్స్లోని ICCCలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉండనుంది. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య శాఖల అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.

రైతుబంధు నిధుల విడుదల, స్దానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ ఉంటుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని రైతులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ్టి రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. , సన్నాలకు బోనస్ డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. కొత్తగా పాస్ బుక్ వచ్చిన వాళ్ళ రైతు భరోసా డబ్బులను ఈ నెల చివరకు విడుదల చేస్తామన్నారు.